నమస్తే.మోక్షం కావాల్సిన మనిషికి బ్రహ్మ విద్యా శాస్త్రం అయిన భగవద్గీతా జ్ఞానం అవసరమా లేక ఉపనిషత్తులు పురాణాలు, వేదాలు అవసరమా?
@malleshdadeputhungur811414 күн бұрын
అన్ని రకాలు లేవు... ఉన్నది ఒక్కటే జ్ఞానం... సరైన గురువు ఏది చెబితే అదే అవసరం...
@PammiSatyanarayanaMurthy13 күн бұрын
@@malleshdadeputhungur8114మనకి ఏది అవసరమో అది చెప్పే గురువులు ఉంటారు.కొంత మందికి మోక్షం అవసరం లేదు నాకు కోరికలు తీర్చే దేవుడి గురించి మాత్రమే కావాలి అంటారు.అందుచేత మనిషికి ఏది అవసరమో చెప్పండి అని అడిగాను.
@visalakshymovva975411 күн бұрын
సమస్త వేద వేదాంత (ఉపనిషత్తులు)సారమంతా భగవద్గీతలో ఉంది... ఇది బ్రహ్మవిద్య గా తెలుసుకోవాలంటే సద్గురువు అవసరం...
@PammiSatyanarayanaMurthy11 күн бұрын
@@visalakshymovva9754 నమస్తే సర్.సమస్త వేద వేదాంత అంటే ఉపనిషత్తులు అని మీ ఉద్దేశ్యమా?వేదాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం, వివరం చూడండి సాంఖ్య యోగము శ్లో।। 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! । నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్।। (బ్రహ్మయోగము, కర్మయోగము) భావము:- మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము. వివరము:- ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము. అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.
@PammiSatyanarayanaMurthy11 күн бұрын
@visalakshimovva సాంఖ్య యోగము శ్లో।। 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! । నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్।। (బ్రహ్మయోగము, కర్మయోగము) భావము:- మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము. వివరము:- ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము. అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము. (దీని తర్వాత విజ్ఞాన యోగం 14 శ్లోకం, వివరం కూడా చూడండి)