గురుభ్యో నమః స్వామీ ఆశీస్సులు కై హైదరాబాద్ లోని మీ ఆశ్రమం లో ఎలా ఎప్పుడు అపాయిట్మ్ంట్ ఎవరిద్వారా తీసుకోవాలి. తెలపగలరు కృతజ్ఞతతో సర్వేపల్లి వేంకటభాస్కరరావు
@PammiSatyanarayanaMurthy2 жыл бұрын
క్రితం విషయమే కంటిన్యూ చేశాను.మార్చేందుకు దైవ జ్జానం తెలిసిన కొందరు ప్రయత్నిస్తే అది తమ మతం కాదని వేరే మతం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దైవ జ్జానమే ప్రచారం చేస్తున్నామని చెప్పినా వినకుండా వారి అనుయాయులు,అజ్జానులు, అసలు భగవద్గీత నే చూడని,చదవని వారిని ఉసిగొల్పి దైవ జ్జానం ప్రచారం చేసే వారిని అడ్డుకొని ప్రచారం చేయవద్దని బెదిరించి కొన్ని చోట్ల వెల కట్టలేని జ్జానం ఉన్న భగవద్గీతనే నిప్పు అంటించి కాల్చే విధంగా తర్ఫీదు పొందిన మూర్ఖల్ని ఏమనాలి? అసలైన దైవ జ్జానం నివురు కప్పిన నిప్పు లాంటిది.ఎప్పటికైనా ప్రపంచం అంతటా వ్యాపింప చేసి విశ్వ వ్యాపి అయిన దేవుడే ఇటువంటి దుర్మార్గులకిభగవద్గీతలోనే చెప్పిన విధంగా రాక్షస యోనుల్లో పుట్టించి ప్రతీ జన్మలోనూ ఘోరమైన శిక్ష విధిస్తారని ఆశించడం, ఇటువంటి వారితో వివాదపడకుండా జ్జాన ప్రచారం చేస్తూ పోవడమే లక్ష్యంగా పని చేస్తూ పోతున్నాం.ఒకవేళ ఇటువంటి వారు ఎదురు పడి కావాలనే వివాదం రేపి చంపేస్తామని బెదించినా బెదరకుండా మొక్కవోని ధైర్యంతో,దీక్షతో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన పరధర్మంలో భయపడే కన్నా స్వధర్మంలో మరణించడమే మేలని త్రికరణ శుద్ధిగా నమ్మిన జ్జానులం మేం.పర ధర్మం అంటే ఇటువంటి వారి బెదిరింపులు, స్వధర్మం అంటే ఆత్మజ్జానం ఆచరణ, ప్రచారం.ఎంతో ఖర్చులు చేస్తూ అధర్మాచరణ చేయడం మేలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నీలోనే ఉన్న దేవుడైన ఆత్మని తెలుసుకొని ఆరాధించడం మేలో విజ్ఞులైన పాఠకులు ప్రేక్షకులు ఆలోచించమని విన్నవిస్తూ శెలవు
@PammiSatyanarayanaMurthy2 жыл бұрын
1)విష్ణువు, వాసుదేవుడు ఒక్కరే అని చెపుతున్నారా? వాసుదేవుడు శ్రీకృష్ణుడు.నిరాకార పరమాత్మ సాకార రూపంలో భగవంతుడిగా వచ్చిన శ్రీకృష్ణుడికి విష్ణువుకి సంబంధం ఏమిటి? 2) ఆసియా ఖండం నుంచి బ్రతుకు తెరువు వెదుక్కుంటూ వలస వచ్చిన భారతదేశంలో ఉన్న అపారమైన నీటి వనరులు బాగా ఉపయోగపడతాయి అని తలచి వారికి ఉన్న అపారమైన ప్రాపంచిక తెలివితేటలతో ఉత్తర భారతదేశంలో అడుగు పెట్టి అక్కడ ఉన్న ఆత్మజ్జానంలో ఆరితేరిన ప్రాపంచిక జ్జానం ఎక్కువగా తెలియని ద్రావిడ బ్రాహ్మణుల్ని తరిమి వేసి ఉత్తర భారతదేశంలో తిష్ఠ వేసి వారికి అలవాటైన యజ్జాలు దానాలు వేదాధ్యనాలు ఉగ్ర తపస్సులు మొదలైన అధర్మాల్ని ఆచరిస్తూ ఉండే వారు.నెమ్మదిగా దక్షిణ భారతదేశంలో కూడా అడుగు పెడదామని ఎన్నో సార్లు ప్రయత్నించినా రావణబ్రహ్మ శ్రీలంకలో ఉన్నంత కాలం ఆర్యుల ఆగడాలు సాగలేదు.పుష్పక విమానంలో సముద్రం దాటి వచ్చి ఆర్యులు చేస్తున్న యజ్జ,దాన,వేదాధ్యయన, తపస్సులు మొదలైన అధర్మాల్ని అడ్డుకొని వినకపోతే శిక్షించేవారు.ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన అధర్మాలు త్రేతాయుగంలో రావణబ్రహ్మకి కూడా తెలుసు కనుక అడ్డుకొనే వారు.ఆయన మరణానంతరం ఆర్యులకి ఇక అడ్డు లేకుండా పోయింది.దక్షిణ భారత దేశంలో కూడా ప్రవేశించి వారు అనుకున్న కుట్రలతో ఇక్కడ ఉన్న మహా జ్జానుల్ని కూడా వారి అద్వైతం వైపు తిప్పుకుని ఇక్కడ దక్షిణ భారతదేశంలో సృష్టి ఆరంభంలో చెప్పబడిన దైవజ్జానంతో ఆచరించవలసిన ధర్మాల్ని పాటిస్తూ ఉన్న ఎంతో మంది జ్జానుల్ని అధర్మాల్నే ధర్మాలని భ్రమింపచేసి దేశంలో సనాతన ధర్మాల్ని లేకుండా చేసిన ఘనమైన చరిత్ర కలిగిన ఆర్యుల నిర్వాకంలో ఒక అతి కౄరమైన విషయం:- వారు అనుకొన్నది సాధించే వరకు అలుపెరుగని విధంగా ప్రయత్నించే గుణం ఉన్న ఆర్యులు ఆర్యుల ద్వారా అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటిస్తే ద్రావిడ బ్రాహ్మణుల్ని నమ్మించ లేమని ఆలోచించి చివరికి దక్షిణ భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో ఉన్న ఆదిశంకరుల వారి తెలివితేటలను చూసి వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని తల్లి తండ్రులకి ఎన్నో హామీలు ఇచ్చి చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా సన్యాసం ఇప్పించి వారితో తీసుకుని పోయి ఆదిశంకరుల వారు ఎంతో తెలివితేటలు గలవారు,ఏక సంధాగ్రాహీ కనుక 16 సంవత్సరాల వయసులోపే ఆర్యులు నేర్పిన నాలుగు వేదాలు చదివిన గొప్ప వారు.అద్వైతం అంటే ఏమిటో కూడా తెలియని వయసులో ఆయనే చెప్పినట్లు ఆయన పేరుతో వారి నమ్మే అద్వైతాన్ని ప్రకటించారు.అక్కడి నుంచి ఆయన పడ్డ కష్టాలు వర్ణనాతీతం.16 సంవత్సరాల నుంచే హిందూ దేశం నలుమూలల వేదాలు వ్యాపించాలనే దురుద్దేశంతో పీఠాలు ముందుగానే తయారు చేయించి కాలి నడకన వారిని నడిపించి వారు అనుకున్న వేదాల్ని నలుమూలల వ్యాపించ చేసేందుకు నాలుగు పీఠాల్ని శంకరులతోనే స్థాపింప చేయాలనే దురాలోచన గల ఆర్యులు ఆది శంకరాచార్యుల వారిని ఎంతో కష్టపెట్టి అసలు విశ్రాంతి తీసుకొనే సమయం కూడా లేకుండా ఒక దాని తర్వాత ఒకటిగా నాలుగు పీఠాల్నీ స్థాపింపచేసి వారి లక్ష్యం సాధించుకున్న ఘనులు ఆర్యులు.ఇటువంటి చరిత్ర కలిగిన ఆర్యుల అధర్మాల్నే ధర్మాలని నమ్మి ఆచరిస్తూ 5000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు సృష్టి ఆరంభంలో చెప్పబడిన దైవజ్జానం మళ్ళీ భగవద్గీతలో చెప్పి గుర్తు చేసినా ఒక ప్రక్క భగవద్గీతని గురించి గొప్పగా చెప్పుకొంటూ మరో ప్రక్క అందులో చెప్పిన కర్మయోగం, బ్రహ్మ యోగం ధర్మాల్ని వదిలి భగవద్గీతలోనే ఇవి అధర్మాలని చెప్పిన వాటినే ధర్మాలని ప్రచారం చేస్తూ ఆచరిస్తూ, అందరినీ ఆచరింప చేయిస్తూ దైవ జ్జానానికి వ్యతిరేకంగా అధర్మాల్లో మునిగి పోయిన ఇటువంటి వారిని ఆ దేవుడు కూడా మార్చలేడేమో.