Рет қаралды 41,628
ప్రపంచవ్యాప్తంగా తినే పదార్థాల కన్నా పారేసేవే ఎక్కువ. ఆహార వృథా ఏటా పెరుగుతోంది.
భారత్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. దిగుబడి ఎక్కువగా రావాలన్న ఆశతో రైతులు తెలిసీ తెలియక నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఫలితంగా పంటల నాణ్యత తగ్గుతోంది. వృథా పెరుగుతోంది. మరి పరిష్కారమేంటి..? అని ఆలోచిస్తే...నిపుణులు చెబుతున్న మాట..పంట విలువ పెంచటం. అందుకు "ఆహార శుద్ధి" మార్గాన్ని ఎంచుకోమన్నది వారి ప్రధాన సూచన. ప్యాకేజ్డ్ ఆహారపదార్థాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ తరుణంలో...రైతులను ఈ రంగంవైపు మళ్లించటం ద్వారా చేయూతనిచ్చినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి P.L.I. పథకం ద్వారా తోడ్పాటునందించేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. వేల కోట్ల రూపాయలు కేటాయించింది కూడా. ఇప్పుడు ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన తోడ్పాటునూ అందిస్తోంది..కేంద్రం.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------