Рет қаралды 750
వారి కుటుంబసభ్యుల నుండి నేను సేకరించిన వివరాలు...
బ్రహ్మశ్రీ పొడుగు పాండురంగ దాసు :. •••••••••••••••••••••••••••••••••• 60,70 దశకాల్లో హరికథలు , బుర్ర కథలకు మంచి ఆదరణ ఉండేది. నిదానంగా రేడియో, టి.వి. ల ప్రాభల్యం పెరగడం , జీవితం లో వేగం పెరగడం తో కళలకు ఆదరణ కరవై పోయి క్రమీణా క్షీణించి పోతున్నాయి. హరికథ చెప్పే విధానంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ప్రస్తుతం మనం చెప్పే కళాకారునిది మన ప్రాంతం . కృష్ణా జిల్లా ప్రస్తుత పామర్రు మండలం లోని కొండిపర్రు గ్రామం . హరి కథా సామ్రాట్ , బ్రహ్మశ్రీ గా పిల్చుకునే శ్రీ పొడుగు పాండు రంగ దాసు గారి గురించి చెప్పు కుంటున్నాము . 1931 సం.రం. పొడుగు ఉమాపతి, నరసమ్మ దంపతులకు కొండి పర్రు లో జన్మించారు. 5 గురి ఆడ పిల్లల తరువాత ఈయన జన్మించారు. ఒక్కగానొక్క మగ బిడ్డను ఆ పాండు రంగడే ప్రసాదించాడని పాండు రంగ అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో ఎక్కువుగా వాహనాలు లేవు కాబట్టి ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్లేందుకు నడకే ఆధారం . నడిచే డప్పుడు చంకన ఉన్న పాండు రంగడు రోడ్డు పక్కనే ఉన్న ఫర్లాంగు రాయి కనబడ గానే చంక నుండి దిగి ఆ రాయి వద్దకు వెళ్లి తల ఆనించి నమస్కరించి మరల వచ్చి చంక ఎక్కే వాడంట. మరి ఆ రాయిని చూస్తే శివలింగ మనో , దేవతా విగ్రహ మనో భావించే వాడేమో మరి ! ఎప్పుడూ దేవుని యడల భక్తి భావంతో ఉండేవాడు . వారికి 6 సం.ల. వయస్సులో హరికథా చక్రవర్తి , బ్రహ్మశ్రీ కొమ్మూరి బాల బ్రహ్మానంద దాసు గారి వద్ద హరికథా గానం నేర్చుకుని 12 వ ఏట నుండే రాష్ట్రం లో, ఇతర రాష్ట్రాలలో కథా గానా లు చేస్తూ పలు ప్రశంసలు , బహుమతులు , సత్కార, సన్మానాలు పొందారు. కొండిపర్రు లోని శ్రీ నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం , సోమయాజులు గారి వద్ద అమరం, ఆంధ్ర నామ సంగ్రహం నేర్చు కొనిరి. తొలుత కొండిపర్రు శ్రీ మార్తి దక్షిణా మూర్తి శాస్త్రి గారి చేతు ల మీదుగా సువర్ణ ఘంటా కంకణ సన్మానం జరిగింది . తరువాత ప.గో.జి. పెనుగొండ గ్రామంలో సువర్ణ యగ్నోప వీత సన్మానం , తు.గో.జి. జగ్గంపేట లో కాలికి గండ పెండేరం ను శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షిత దాసు గారి చేత స్వీక రించడం జరిగింది. విశాఖ పట్నం వాస్తవ్యులు శ్రీ అను పోజు లక్ష్మణ రావు గారు రాసిన ఓం ! హర శంకరా అను పాటను నృత్యం చేస్తూ హృద్యంగా పాడేవారు . ఇప్ప టికీ ఆ పాట ఆయనే సొంత మని అంటారు. నటనలో దిట్ట. చెన్నై లో ఒక సారి సినీ దర్శ కులు కమలాకర కామేశ్వర రావ్ మరి కొందరు ప్రముఖుల ముందు ఎదురుగా కథను చెప్పి భళిరా అనిపించు కున్నారు. నటన ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారా అని ప్రశంసించారు. హైద్రాబాద్ లో భుజకీర్తులతో, విజయ నగరం జిల్ల చీపురు పల్లి లో బంగారు చిడుతలు బహూకరణ , ఖమ్మం పట్టణ ములో కనకాభి షేకం , వెస్ట్ బెంగాల్ లో టాటా నగర్ లో ఫియట్ కారు బహుకరణ గా పొందారు. తోటి కళా కారు లతో ఎంతో ప్రేమగా , ఆప్యాయంగా ఉండేవారు . అనేక మందికి ఆర్థిక సహాయం చేసే వారు. చివరిగా విజయవాడ లో పుష్ప కిరీటం తో సన్మానించి గజా రోహణ చేయించారు. సువర్ణ హస్త, ఘంటా కంకణ , గండపెండేర భూషిత, గజారోహణ సన్మానిత , హరికథా సామ్రాట్, బ్రహ్మశ్రీ పొడుగు పాండు రంగ దాసు గారు 1974 డిసెంబర్ 29 న స్వర్గస్తు లైనారు. పాండు రంగ దాసు గారి వివాహం వారి పెద్ద అక్క కుమార్తె జానకమ్మ తో జరిగింది. వీరికి 6 గురు సంతా నం. 3 కుమారులు , 3 కుమా ర్తెలు. పెద్ద కుమారుడు ప్రభాకర్ మృదంగం, తబల, డోలక్ విద్వాంసుడు. 2 వ కుమార్తె కె . లలిత కుమారి . ఈమె కూడా హరికథా కళా కారిణి . అనేక రాష్ట్రాల్లో హరికథా గానం చేసారు. ముగ్గురు కుమారులు ఫొటో గ్రాఫర్స్ గా స్థిర పడ్డారు. ఆయన చనిపోయి 46 సం.లు. అయినా అప్పటి నుండీ మొదట వర్ధంతి భీమవరంలో , 2 వది తెనాలి పట్టణంలో, 3 రాజమండ్రి , 4,5 తు.గో.జి. అంగర లో , తరువాత స్వగ్రామం కొండి పర్రులో, ఆ తరువాత కృష్ణా పురం , పెనమకూరు , తోట్ల వల్లూరు ఇలా నేటి వరకు పలు ప్రాంతాలలో వారి వర్ధంతి, జయంతి లను వారి శిష్యులు , కుటుంబస్థులు నిర్వహిస్తూనే ఉన్నారు . ఇన్ని సం.లు. అయినా మా తండ్రి గారిని తల్చుకుంటూ కార్య క్రమాలు నిర్వహించడం మా కెంతో ఆనందం గానూ , గర్వం గానూ ఉన్నదని , ఇది మా పూర్వ జన్మ సుకృతంగా భావి స్తున్నామని కుటుంబస్థులు తమ ఆనందాన్ని వ్యక్త పరు స్తారు. వక్కలగడ్డ గ్రామంలో 90 వ జయంతిని , 91 వ జయంతిని ఇటీవల పామర్రు శివాలయం వద్ద 21-2-21 న పామర్రు కళా పరిషత్ ఆద్వర్యంలో నిర్వహించారు .... •••••••••••••••••••••••••••••••••• వి. యల్. ప్రసాద్ , జమీ గొల్వేపల్లి. ( పోస్ట్ నెం : 64 ).
I hope you enjoyed this video
hit likes.
And do subscribe to my channel
Part 1 - • How to Draw Outline us...
Follow Me On:
Instagram- / dcfadein
Twitter- / dcfadein
Facebook- / dcfadein
#telugudrawing #telugu #teluguvlogs