Рет қаралды 5,399
#venkatagiri #2023 #jathara2023
APరాష్ట్ర పండుగ వెంకటగిరి పోలేరమ్మ జాతర స్పెషల్ ఈవెంట్స్..వీరశైవ నృత్యం,కొమ్ము వాయిద్యాలు,వారహ రూపం
వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని,తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసన వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్తులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది.ప్రతి సంవత్సరం భాద్రపద మాసాన వెంకటగిరి గ్రామస్తులు ఐదు రోజులు పాటు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరి గ్రామస్తులు మొదటి చాటింపు వేస్తారు.అలాగే రెండో బుధవారం రోజున కూడా చాటింపు వేస్తారు. మూడో బుధవారం, గురువారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు.[2]జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లోని శుభకార్యాలు చేసుకోరు.జాతర మహోత్సవం అయిదు రోజులపాటు సాంప్రదాయకంగా జరుగుతుంది.జాతర ముందు గ్రామ పొలిమేరలో రెండు రాళ్లును శక్తి స్వరూపలుగా ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తారు. ముందుగా భక్తులకు పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకొని వస్తారు.అర్ధరాత్రి తరువాత కళ్ళూ, దిష్టిచుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు.అనంతరం అమ్మవారికి దున్నపోతును బలిస్తారు.అలాగే భక్తుల్లో మొక్కులు ఉన్నవారు జంతుబలులు ఇస్తారు.ఇలా చేయడం అందరికీ మంచిదని ఆ గ్రామస్తుల నమ్మకం.1919లో గ్రామశక్తి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు.అప్పటి నుండి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది.[3]పోలేరమ్మజాతర అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భారీగా నిర్వహిస్తారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఊరేగింపులో పాల్గొంటారు.సాంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజులు అమ్మవారికి సారే అందజేస్తారు.గురువారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో అమ్మవారిని ట్రాక్టర్పై ఊరేగింపుగా రాజావీధి మీదుగా కాశీపేట,శివాలయంవీధి మీదుగా మల్లమ్మగుడి ప్రాంతంలో నిమర్జనం చేస్తారు.ఈ జాతర చూడటానికి నెల్లూరు,తిరుపతి, శ్రీ కాళహస్తి మరియు చెన్నై వంటి సమీప సమీప నగరాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.రవాణా సౌకర్యాలు
సవరించు
ఈ జాతర చూడడానికి వివిధ జిల్లాల నుంచి భారీగా జనం వస్తూ ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ జాతరకి గోదావరి జిల్లాల నుండి అలాగే తమిళనాడులో చెన్నై నుండి అధికంగా భక్తులు వస్తూ ఉంటారు.
similar searching:
Venkatagiri jathara update
Venkatagiri jathara
Venkatagiri polerammajathara
2024 Venkatagiri jathara update
Venkatagiri polerammajathara special celebration
jathara update videos 2023