Рет қаралды 25,953
మానవ సమాజాన్ని నేడు ఆవేదనలకు గురిచేస్తున్న అతిపెద్ద సమస్య అనారోగ్యం. దేశీయ ఆహారమైన సిరిధాన్యాలతో అనేక అనారోగ్య సమస్యలకు సులవైన పరిష్కారం చూపుతున్నారు... ప్రముఖ ఆహార నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి. ఈ నేపథ్యంలో... రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ పక్కన గల బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఆగస్టు 28న అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఖాదర్ వలి ... సిరిధాన్యాలు, వాటిలో ఉండే పోషకాలు, రోగాలను బాగు చేయడంలో వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. చిరుధాన్యాల నిపుణులు ఎం.సి.వి. ప్రసాద్, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిధాన్యాల విశిష్టతలను వివరిస్తూ రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన "సిరిధాన్యాలు" పుస్తకాన్ని ఈ సందర్భంగా డాక్టర్ ఖాదర్ వలి ఆవిష్కరించారు.
---------------------------------------------------------------------------------------------------------------------------------
#Dr.Khader Valli explained the #HealthBenefits of #Millets at the awareness program organized by #Rythunestham Foundation. The event held at Babu Jagjeevanram hall, kothapet, hyderabad on 28th August, 2018. Khader Valli explained the types of Millets and their #nutrition Values. He speaks about #Diseases, #HealthDisorders #Hormonalimbalance, and Elaborates How #Millets and #Natural #leaf #Soups Plays Important Role in Curing Them.