Рет қаралды 455,533
పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలం హకీంపేట గ్రామంలో దాదాపు 20 ఏండ్లుగా ఆవులను పెంచుతున్న క్రిష్ణ స్వామి గారి గో సేవ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దూడలు, ఆవులు కలుపుకొని మొత్తం 54 గోవులు వారి గోశాలలో పెరుగుతున్నాయి. ప్రతిరోజు అడవికి తోలుకు వెళ్లి మేపడంతోపాటు.. వాటి నుంచి ఒక్కరోజు కూడా పాలు తీసుకోకుండా దూడల కోసమే కేటాయిస్తున్నామని చెప్తున్నారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం లభిస్తుంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 54 ఆవులను పెంచుతున్న.. ఎన్నడూ పాలు పితకము | రైతు బడి
#RythuBadi #గోసేవ #గోశాల