ఆసక్తికరమైన గంగా శంతనుడి ప్రేమ కథ తెలుసా? || భీష్ముని జన్మ వృత్తాంతం || Chaganti koteswara rao

  Рет қаралды 1,515

Sri Guru Bhakthi Pravachanalu

Sri Guru Bhakthi Pravachanalu

Күн бұрын

Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి? అది ఎందుకు చేయాల్సి వచ్చింది.? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?
• Video
Ganga santhanula Katha in Telugu Mahabaratham
Interesting Love Story Of Shantanu And Ganga
This story about beautiful love story of Ganga and King Santhanu and birth of Devavratha (Bheeshma Pitamaha)
Bhismuni jananam
#Bhismunijananam , Bhismuni jananam chaganti,
#chaganti #latest #speeches #chagantispeeches
chaganti koteswara rao speeches latest speeches
Chaganti koteshwara rao speeches LATEST Pravachanam2021
Chaganti koteshwara rao speeches2021
Chaganti koteswara rao special SPEECHES chaganti
chaganti koteswara rao speeches latest pravachanam 2021
Sri Chaganti koteswara rao SPEECH latest2021 |
Sri Chaganti koteswara rao pravachanam latest2021
#sri guru bhakthi pravachanalu
భీష్ముని జన్మవృత్తాంతం
పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలూ నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూసాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్ధించాడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై
మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న ఆష్ట వశువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు " వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు " అని వేడుకున్నారు. వశువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్గాయువౌతాడని అది వశిష్ట శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒక రోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మ వాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన ఏడుగురు వశువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిభంధలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్గాయుష్మంతుడని అతనికి విద్యాబుద్దులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యాపారంగతుడూ మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది.
అష్టవశువుల వృత్తాంతం
కామదేనువు అపహరించమంటున్న ప్రభాసుని భార్య
గంగాదేవి శంతనుని విడిచి వెళ్ళే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు.సమాధానంగా గంగాదేవి "మహారాజా వరుణుడి కుమారుడు వశిష్టుడు.అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు.నందిని అనే కామదేనువు వశిష్టుడికి కావలసిన సమస్త వస్తువులూ సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది.ముని వద్దకు వచ్చిన అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన
స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది.మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆధేనువును వశిష్టుడి నుండి పట్టుకుని వెళ్ళడానికి తోడ్పడ్డారు.యోగదృష్టితో ఇది గ్రహించిన వశిష్టుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు.వసువులు తప్పు గ్రహించి వశిష్టుని కాళ్ళ మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్టుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతాన హీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు." అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదవ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది.

Пікірлер: 3
@prahallada.B
@prahallada.B 3 жыл бұрын
Nice story 👌 👏 👍
@SriGuruBhakthiPravachanalu
@SriGuruBhakthiPravachanalu 3 жыл бұрын
Thank you so much 😀
@rams-nandan
@rams-nandan 24 күн бұрын
Story kadhu. Nijanga jarigindhi. Devotional history..
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 9 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 15 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 21 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 209 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,5 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 9 МЛН