Рет қаралды 157,353
పోషక విలువలులేని ఆహార పదార్థాలతో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి నశిస్తోందని చిరుధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వలి స్పష్టంచేశారు. మాంసం, పాలు, బియ్యం, గోధుమలను ఆహారంగా తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు సిరిధాన్యాలు, కషాయాలే పరిష్కారమని వివరించారు. రైతునేస్తం ఆధ్వర్యంలో హైదరాబాద్ లకడీకపూల్లోని రెడ్హిల్స్ కాలనీలోని ఫాప్సీ భవన్లో సిరిధాన్యాలపై జూన్ 15న నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాల నిపుణులు ఎం.సి.వి. ప్రసాద్, సాక్షి సాగుబడి డెస్క్ ఎడిటర్ పంతంగి రాంబాబు, ప్రగతి రిసార్ట్స్ అధినేత జి.బి.కే. రావు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలను ఆహారంగా తీసుకుంటే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని ఖాదర్ వలి పేర్కొన్నారు. వాణిజ్య ప్రయోజనాలకోసం పాశ్చాత్య దేశాలు రసాయనాలతోకూడిన ఆహార పదార్థాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని విమర్శించారు. పాలు, టీ, కాఫీ మానేయాలని సూచించారు. ఆధునిక ఆహారపు అలావట్లు మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని తెలిపారు. మన పూర్వీకుల ఆహారమైన సిరిధాన్యాలు, కషాయాలను ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
#Dr.Khader Valli explained the #HealthBenefits of #Millets at the awareness program organized by #Rythunestham Foundation. The event held at FTAPCCI Bhavan, Redhills colony, lakdikapool, Hyderabad. on 15th June, 2018. Khader Valli explained the types of Millets and their #nutrition Values. He speaks about #Diseases, #HealthDisorders #Hormonalimbalance, and Elaborates How #Millets and #Natural #leaf #Soups plays important role in curing them.