Рет қаралды 84,467
#meil #polavaram #andhrapradesh #LifelineOfAndhraPradesh
పోలవరం ప్రాజెక్ట్ : నది మధ్యలో అరుదైన భారీ ECRF నిర్మాణం
ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్వే తో నిర్మితమవుతున్నది పోలవరం ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ మరో కొత్త ఘట్టానికి తెర లేచింది. ప్రాజెక్ట్ లో కీలకమైనది ECRF - ఎర్త్ కం రాక్ ఫిల్ డాం. దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో గ్యాప్ 1, గ్యాప్ 2 కింద రెండు విభాగాలుగా చేసే పనులు గోదావరి లో ఎడమవైపున.. అంటే, నిర్మాణంలో వున్న జలవిద్యుత్ కేంద్రం వైపున ఉంటాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే గోదావరి నది ప్రధాన నీటి ప్రవాహ భాగంలో ఈ ECRF రూపుదిద్దుకుంటోంది.
సాధారణంగా నదీ ప్రవాహప్రాంతంలో కాంక్రీట్ స్పిల్వే తో కూడిన జలాశయాన్ని నిర్మిస్తారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ కు వచ్చేసరికి ఎక్కడా లేని విధంగా.. ప్రత్యేకంగా.. నదీ ప్రవాహానికి సంబంధం లేని విధంగా.. కుడి వైపున భారీ స్పిల్వే నిర్మించారు. నది మధ్య భాగంలో ECRF ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఈ విధంగా నది ప్రవాహాన్ని కుడి వైపునకు మళ్లించి.. అసలైన నదీ గర్భంలో ECRF నిర్మించటం అనేది ఇంజనీరింగ్ ప్రత్యేకతల్లో అరుదైనది.
నది మధ్య భాగంలో స్పిల్వే నిర్మించటానికి అవసరమైన పునాది వేసేందుకు నేల స్వభావంలో పటుత్వం లోపించింది. ఇసుక అధికంగా ఉండటం వల్ల స్పిల్వే ను కుడివైపున నిర్మించి నది మధ్యలో ECRF పనులు చేపట్టారు. ఈ ECRF పనులు చాల క్లిష్టమైనవి. సాధారణంగా జలాశయాలకు ECRF నది మధ్యభాగంలో కాకుండా స్పిల్వే కు ఆనుకుని గట్టుకు సరిహద్దులో అటుఇటు ఉంటాయి. కానీ పోలవరం లో మాత్రమే ప్రత్యేకంగా నది మధ్యభాగంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ ECRF పనులు తాజాగా మొదలయ్యాయి. ఇది ఎంత పెద్దదంటే.. ఇది దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. స్పిల్వే కు ఆనుకుని ఎడమ వైపున గ్యాప్ 3 కాంక్రీటు నిర్మాణం పూర్తి చేశారు. అక్కడ నుంచి ఎడమ గట్టు వరకు పూర్తిగా గ్యాప్ 1, గ్యాప్ 2 ECRF పనులు చేపట్టారు. ఇవి కూడా ఎంత పెద్దవంటే.. జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 194 టిఎంసీ ల నీరు వున్నా తట్టుకుని నిలబడగలగాలి. కనీస నీటి నిల్వ 19 టీఎంసీ లు, సరాసరి నీటి నిల్వ 175 టీఎంసీ లు ఉంటుంది. 3 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం నుంచి వరదనీరు వస్తుంది. ఈ వరద నీరు జలాశయంలోని 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 32 మీటర్ల లోతున విస్తరించి ఉంటుంది. ఇంత నీటి ఒత్తిడిని తట్టుకునే విధంగా ఈ ECRF ను నిర్మించాలి.
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.