Рет қаралды 584
కల్వకొలను చిత్తరంజన్ సాస్ స్మారక సేవా సంస్థ, లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్ధం.... అనే మహోన్నత సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం శతకోటి గాయత్రీ మహా మంత్ర జప యజ్ఞం*. ఇందులో భాగంగా, నేడు *బాసర పుణ్యక్షేత్రం నందు వందల మంది గాయత్రీ స్వరూపులచే గాయత్రీ హవనం సుసంపన్నం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గురువు గారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గారు మరియు గురుపత్ని శ్రీమతి జయలక్ష్మీ శ్రీరామచంద్ర మూర్తి గారు విచ్చేసి పాల్గొన్న వారందరినీ ఆశీర్వదించారు.
ఈ ధర్మయజ్ఞం యొక్క మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని, జూలై2024 నందు అయోధ్య నగరం నందు, రామ్ లల్లా సమక్షంలో సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
ధర్మస్య విజయోస్తు 🙏🏽