Рет қаралды 12,233
ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్లో ఒక సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం 80 వేల మంది పాల్గొనడానికి ఈ సత్సంగ్కు అనుమతి ఇచ్చారు. కానీ అక్కడ లక్ష మందికి పైగా జనం వచ్చారు. ఆ ప్రాంతంలో డాక్టర్లు, అంబులెన్సుల సౌకర్యం ఏదీ లేదని బాధితులు ఆరోపించారు.
అక్కడ అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులకు దాని గురించి అసలు సమాచారమే లేదనే విషయం బీబీసీ పరిశోధనలో తేలింది. బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో కూడా నిర్లక్ష్యం జరిగింది. ఇంత పెద్ద విషాదం జరిగినపుడు వైద్య సేవలు, డాక్టర్ల కొరతలాంటి వాస్తవాలు వెలుగుచూశాయి.
#UttarPradesh #Hathras #Stampede #medicalfacilities #YogiAdityanath
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu